1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Hyderabad : Couple suicide with sleeping Tablets

శీతలపానీయంలో నిద్రమాత్రలు కలుపుకుని...

Hyderabad
శీతలపానీయంలో నిద్రమాత్రలు వేసుకుని పంజాబ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ నగరంలో అంబర్‌పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీ కాలనీలో పంజాబీకి చెందిన కుటుంబం కూల్డ్రింక్‌లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ ఇద్దరినీ ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులను పవన్ (65), భార్య నీలం (55)లుగా గుర్తించారు. అలాగే పిల్లలను మన్ను (34),  నిఖిల్ (30)గా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. పిల్లలిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
నీ సన్న బియ్యం సంగతి తేలుస్తా.. నువ్వు తేల్చలేవ్: మంత్రి కొడాలి నాని వర్సెస్ అచ్చెన్న