రాష్ట్ర బాధితుల్లో నేనూ కూడా ఉన్నా... నేను ఇక్కడ... నా భార్య హైదరాబాద్లో!: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బాధితుల్లో తానూ ఒకడినని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి వెలగపూడిలోని సచివాలయ భవనాలను గురువారం చంద్రబాబు సందర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బాధితుల్లో తానూ ఒకడినని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి వెలగపూడిలోని సచివాలయ భవనాలను గురువారం చంద్రబాబు సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడి ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. ఓ ఉద్యోగి మాట్లాడుతూ విభజన కారణంగా తాను భార్యాపిల్లలతో విడిపోవాల్సి వచ్చిందని అన్నారు. వారు హైదరాబాద్లో ఉంటే తాను ఇక్కడ పనిచేయాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... చంద్రబాబు రాష్ట్ర విభజన గాయాలు తనకూ తగిలాయన్నారు. తానూ విభజన బాధితుడినేనని తెలిపారు. ‘‘నేను ఇక్కడ.. నా భార్య హైదరాబాద్లో’’ అంటూ చమత్కరించారు.