1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 13 మార్చి 2021 (17:16 IST)

పవన్ కళ్యాణ్ ఆ పని చేస్తే విశాఖ ఉక్కు దక్కుతుంది: గంటా శ్రీనివాసరావు

విశాఖ ఉక్కు కోసం 25 మంది ఎంపిలు, 175 మంది ఎమ్మెల్యేలు తమ పదవులను రాజీనామా చేయాలన్నారు మాజీ మంత్రి, టిడిపి నేత గంటా శ్రీనివాసరావు. రాజీనామాలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామన్నారు. విశాఖ ఉక్కుపై పవన్ కళ్యాణ్ బిజెపిపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలా చేస్తే మన విశాఖ ఉక్కు మనకు దక్కుతుందన్నారు.
 
తెలుగువారి ఆత్మగౌరవం విశాఖ ఉక్కు అన్న గంటా శ్రీనివాసరావు.. విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలన్నారు. ఉక్కు పోరాటంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారని.. లేఖ కూడా రాశారన్నారు. 10 వేల మంది నిర్వాసితులు, వేలాదిమంది ఉద్యోగులు, లక్షలాది కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా విశాఖ ఉక్కుపై ఆధారపడి ఉన్నాయన్నారు.
 
ఇప్పటికే 32 మంది విశాఖ ఉక్కు కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. తన రాజీనామాపై రాజకీయ విమర్సలు చేయడం బాధాకరమన్న గంటా శ్రీనివాసరావు, రాజీనామాపై స్పీకర్ ఫోన్ చేశారని, రాజీనామాను ఆమోదించమని కోరానన్నారు. రాజకీయ లబ్ధి కోసం తన పదవికి రాజీనామా చేయలేదన్నారు.
 
బిజెపి నేతలు స్పందిస్తున్న తీరు బాధాకరమని.. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తున్నట్లు స్వయంగా విజయసాయిరెడ్డే చెప్పారని గుర్తు చేశారు. బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకించారని, ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం విశాఖ ఉక్కుపై పునరాలోచన చేయాలన్నారు.