అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ భర్త మర్మాంగాలను పిసికి చంపేసిన భార్య!
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ భావించిన ఓ మహిళ.. తన ప్రియుడితో కలిసి భర్తను కాటికి సాగనంపింది. ఈ దారుణం మెదక్ జిల్లా ఆందోల్ మండలం, నేరేడుగుంట అనే గ్రామంలో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
నేరేడుగుంట గ్రామానికి చెందిన ఖారిదాబాద్ రమేష్ అనే వ్యక్తికి అంజమ్మ అనే మహిళతో ఆరేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కొడుకులు ఒక కుమారుడు ఉన్నాడు. రమేష్ ఆటో నడుపుతూ భార్యాపిల్లలను పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అంజమ్మకు అదే గ్రామనికి చెందిన శివకుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆయన భార్యను మందలించాడు.
దీన్ని ఎంతమాత్రం జీర్ణించుకోలేని అంజమ్మ.. తన ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ వేసింది. ఈ క్రమంలో తన భర్త నిద్రిస్తున్న సమయంలో ప్రియుడు శివకుమార్, మరో యువకుడు మల్లేశం సహకారంతో నరేష్ ముఖం పై ఊపిరాడకుండా దిండుతో ఒత్తిపట్టి మర్మాంగాలను పిసికి అతి దారుణంగా హత్య చేశారు.
ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జోగిపేట సీఐ నాగయ్య, ఎస్సై విజయరావ్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య అంజమ్మను, ప్రియిడు శివకుమార్, మల్లేశంలను అదుపులోకి తీసుకుని జోగిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.