సంబంధిత వార్తలు
- కుట్రాళం వాటర్ ఫాల్స్లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video
- రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్
- హైదరాబాద్లో భారీ వర్షాలు.. సన్ రైజర్స్కు కలిసొచ్చేనా?
- తెలంగాణ: మూడు రోజులు జాగ్రత్త.. పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్
- హమ్మయ్య.. బెంగళూరులో భారీ వర్షాలు.. నీటి ఎద్దడి అలా తగ్గింది..
ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమను ఆనుకుని ఉత్తర తమిళనాడు మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని, అదే సమయంలో ఛత్తీస్ గఢ్ నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్టు తెలిపింది.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం నెల్లూరు, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు, నంద్యాల, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తర్వాతి కథనం
