దీక్షలతో జగన్ ను గిన్నిస్ బుక్ లో చేరుతారు... గాలి ఎద్దేవా
దీక్షల విషయంలో జగన్ గిన్నిస్ బుక్లో చేరతాడని, వైసీపీ అధినేత జగన్ దీక్షలు ఎందుకోసం చేస్తున్నారో ఆయనకే తెలియదని గాలి ఎద్దేశా చేశారు.. ఆదివారం నాడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు రైతు రుణమాఫీ చేశారని ప్రశంసించారు.
రాష్ట్ర విభజనకు జగన్ మద్దతిచ్చారని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రత్యేక హోదా సాధించేందుకు అందరూ కలిసి ప్రయత్నించాలని గాలి ముద్దుకృష్ణమ పిలుపునిచ్చారు. ఆ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేశారని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ, విద్య, భవనాలు పంపిణీ ఇలా అన్నింటిలోనూ ఏపీ అన్యాయమే జరిగిందన్నారు.