కృష్ణా పుష్కరాలు విజయవంతం కాకుండా జగన్ కుట్ర, గంటగంటకూ నీటి పరీక్ష
విజయవాడ : కృష్ణా పుష్కరాలు విజయవంతం కాకుండా వైకాపా కుట్ర పన్నుతోందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరోపించారు. పరోక్షంగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పుష్కరాలకు వచ్చే భక్తులను వైకాపా భయపెడు
విజయవాడ : కృష్ణా పుష్కరాలు విజయవంతం కాకుండా వైకాపా కుట్ర పన్నుతోందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరోపించారు. పరోక్షంగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పుష్కరాలకు వచ్చే భక్తులను వైకాపా భయపెడుతోందన్నారు. కృష్ణ నీటిలో ఈకొలై వైరస్ ఉందని ప్రజలను భయపెడుతున్నారని, పోలవరం ప్రాజెక్టును, కొత్త రాజధాని అమరావతిని అడ్డుకోవాలని చూసి భంగపడ్డ వైకాపా నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు.
రేపటి నుంచి గంటగంటకు నీటి పరీక్షలు: ఏపీ సీఎం చంద్రబాబు
నీటిలో ఈకోలై బ్యాక్టీయా ఉందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నీటిలో ఎలాంటి ఈకోలై బ్యాక్టీరియా లేదని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇది నీటి పరిక్షల్లో వెల్లడైయిందన్నారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ధైర్యంగా పుణ్య స్నానాలు చేయవచ్చని చెప్పారు.