ఇది తెలంగాణ ప్రగతి రథం.. కేసీఆర్కు కొత్త బస్సు
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పర్యటన కోసం కొత్త బస్సును రంగంలోకి దింపారు. దాని ఖరీదు రూ.5 కోట్లు. అత్యంత భధ్రత కలిగిన బుల్లెట్ ప్రూఫ్ బస్సుకు ‘తెలంగాణ ప్రగతి రథం’ అని నామకరణం చేశారు. ఈ బస్సుకు మేడ్చల్ ఆర్డీవో కార్యాలయంలో రిజిసే్ట్రషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఉన్న అన్ని వాహనాలకు ఉన్నట్టుగానే ఈ బస్సుకు కూడా అన్నీ ఆరులతో టీఎ్స07జడ్6666 నెంబరును కేటాయించారు. రిజిస్ట్రేషన్ అనంతరం సీఎం కార్యాలయ అధికారి అజిత్, భద్రతా సిబ్బంది, ఆర్టీసీ అధికారులు బస్సులో యాదగిరి గుట్టకు చేరుకున్నారు. ఆలయ పడమటి రాజగోపురం ఎదుట వేదమంత్రాలతో పురోహితులు, అర్చకులు సంప్రదాయ రీతిలో వాహన పూజలు నిర్వహించారు.