సంబంధిత వార్తలు
- కన్హయ్యపై చార్జిషీటును తిరస్కరించిన ఢిల్లీ కోర్టు
- మహానుభావుడు... ప్రియుడితో పారిపోయి తిరిగొచ్చిన భార్యను దగ్గరకి చేర్చుకున్నాడు...
- శభాష్ సాంబశివరావు... 8 మంది సీఎంల మన్ననలు పొందిన అధికారి
- బడ్జెట్ సమావేశాలకు వైసీపి సభ్యులను ఆహ్వానిస్తున్నా... స్పీకర్ కోడెల, వస్తారా?
- #BudgetSession2019 : ఏపీకి మోడీ మొండిచేయి : రైల్వే జోన్ ఊసేలేదు...
ముగ్గురి ఎమ్మెల్యేల రాజీనామాలకు ఆమోదం
నిరసన తీర్మానాలు చేసిన అధికార పక్షంలో నల్లచొక్కాలతో హాజరైన అసెంబ్లీ సమావేశాలలో... పార్టీలు మారుతూ రాజీనామాలు సమర్పించిన ముగ్గురి ఎమ్మెల్యేలు రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. వివరాలలోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు.
వారిలో తెదేపా నుండి వైకాపా గూటికి చేరిన మేడా మల్లిఖార్జునరెడ్డి, తెదేపా నుండి జనసేనలో చేరిన రావెల కిశోర్బాబు, భాజపా నుండి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణలు ఉన్నారు. ఈ ముగ్గురి రాజీనామాలకు స్పీకర్ ఆమోదముద్ర వేసారు. పార్టీ మారే సమయంలోనే ఈ ముగ్గురు తమ ఎమ్మెల్యే పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు కూడా రాజీనామా చేసారు.
తర్వాతి కథనం
