సంబంధిత వార్తలు
- ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి... పలువురు ఎంపీల అభినందన
- రాజ్భవన్కు కేసీఆర్.. సీఎం పదవికి రాజీనామా
- మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయం తప్పే.. కానీ, ఉద్ధవ్ సర్కారును పునరుద్ధరించలేం : సుప్రీం
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు - జగిత్యాల ఛైర్పర్సన్ రాజీనామా
- ఒంగోలులో కోవిడ్ పాజిటివ్.. మూడుకు చేరిన కేసులు
వైసీపీ కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ మరో నేతను కోల్పోయింది. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు తన ఎంపీ పదవికి కూడా సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. తాజాగా వైసీపీ అధిష్టానం ఆయనను కర్నూలు పార్లమెంట్ స్థానానికి ఇన్చార్జి పదవి నుంచి తప్పించింది.
ఈ కారణంగానే మనస్తాపం చెంది రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ సంజీవ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన అనుచరులు, మద్దతుదారులు, బంధువులతో చర్చించి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
బుధవారం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు.
