Nara Lokesh: యువగళం పాదయాత్రపై పుస్తకం.. పవన్కు అందజేసిన నారా లోకేష్ (ఫోటోలు)
యువనేత నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని అందజేశారు. కేబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్తో పాటు, ఇతర మంత్రులకు లోకేష్ అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృత మైందన్నారు. ఈ రోజుకు అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయ్యిందని తెలిపారు.
ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై లోకేష్ను ప్రశంసించారు. ఈ సందర్భంగా తీసిన పవన్- లోకేష్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.