1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (19:27 IST)

కులదురహంకార హత్య.. కారులో ఎక్కించుకున్నారు.. గొంతుకోశారు..

crime scene
రాప్తాడు మండలంలో దారుణం జరిగింది. ఓ యువకుడు కులదురహంకార హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రాప్తాడు మండల కేంద్రమైన కనగానపల్లిలో ఉంటోన్న బిసి సామాజిక తరగతికి చెందిన చిట్రా నాగను, ముత్యాలమ్మ దంపతుల కుమారుడు కురుబ చిట్రా మురళి (27) అదే గ్రామంలోని ఒసి సామాజిక తరగతికి చెందిన ఎం.వీణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
 
సామాజిక తరగతులు వేరంటూ వీరి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో, వీరిద్దరూ పెద్దలను ఎదిరించి 2021 ఆగస్టులో వివాహం చేసుకున్నారు.  వీరిద్దరూ రాప్తాడులో ఉంటూ వారివారి ఉద్యోగాలకువెళ్లి వస్తుండేవారు. గురువారం రాత్రి కియాకువెళ్లేందుకు రాప్తాడు వై.జంక్షన్‌ వద్ద మురళి వేచి ఉన్నాడు. అప్పటికే అక్కడ కాపుకాచి ఉన్న యువతి కుటుంబ సభ్యులు ఆయనను బలవంతంగా కారులో ఎక్కించారు.
 
అక్కడి నుంచి రాప్తాడు సమీపంలోని త్రిబుల్‌ ఆర్‌ ‌ రెస్టారెంట్‌ వద్దకుతీసుకెళ్లి కత్తితో మెడకోసి హత్య చేసి సమపంలోని పొలంలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. యువతి కుటుంబ సభ్యులే తమ కుమారుడిని హత్య చేశారని యువకుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి కుటుంబసభ్యులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.