గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (15:30 IST)

పందుల కంటే ఓటర్లు హీనమా? హీరో మంచు ప్రశ్న

'కలెక్షన్ కింగ్' మంచు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు మంగళవారం తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మంచు మనోజ్ చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. మొదటగా తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా జూన్‌లో ప్రారంభం కాబోతున్న తన సినిమాని గురించి వెల్లడించిన ఆయన... తర్వాత ఓటు హక్కుకు గల ప్రాధాన్యతను గురించి వివరించడం ఆసక్తికరంగా సాగింది.
 
వివరాలలోకి వెళ్తే... తాను ఈ మధ్యనే కొన్ని మార్కెట్‌లలో కొన్ని జంతువుల ధరలు తెలుసుకున్నాననీ.. మంచి గేదె దాదాపుగా రూ.80 వేల ధర పలుకుతోందనీ... మేక రూ.8 వేల వరకూ ఉంటోందనీ... పంది ధర అయితే రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ ఉంటోందన్నారు. 
 
కానీ, మన ఓటు ధర విలువ రూ.500 నుంచి మహా అయితే రూ.5000 పలుకుతోందనీ.. అంటే మనం పందుల కంటే హీనమా? అంటూ ప్రశ్నించాడు. డబ్బుకు అమ్ముడు పోయి ఓటు వేయవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించాడు.