1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2023 (12:47 IST)

కరువు కాటకాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. కాకాణి గోవర్ధన్ రెడ్డి

kakani
కరువు కాటకాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబే రాష్ట్రానికి అరిష్టమని, దరిద్రమని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. నిలువెల్లా విషాన్ని దాచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కాకాణి విమర్శించారు. 
 
నయవంచన రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు తెలిపారు. కాసుల కోసం కాంట్రాక్టర్లను వేధించి ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. నెల్లూరు, సంగం బ్యారేజీల దగ్గర ఫోటోలు దిగే దమ్ముందా? అని చంద్రబాబు కాకాణి సవాల్ విసిరారు. 
 
సీఎం వైఎస్‌ జగన్‌ నాయత్వంలో చిత్తశుద్ధితో తాము పని చేస్తున్నామని, నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి చెబుతూ ఇల్లిల్లూ తాము తిరుగుతున్నామని, అలా తిరిగే దమ్మూ, ధైర్యం అప్పటి ఎమ్మెల్యేలకు ఎందుకు లేదు? అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రశ్నించారు.