గుర్రమెక్కిన ఎమ్మెల్యే.. గుడ్ మోర్నింగ్ అంటూ...

సోమవారం, 17 ఆగస్టు 2020 (09:08 IST)
'గుడ్ మార్నింగ్ ధర్మవరం' అంటూ పలకరించే అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ సారి డిఫరెంట్ స్టైల్ లో కనిపించారు.

ప్రతిరోజు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ పలు కాలనీల్లో పర్యటిస్తుంటారు. ఉదయాన్నే ఆయన కాలనీల్లో తిరగడం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆయన ఒక్కోసారి ఒక్కో స్టైల్ లో కనిపిస్తుంటారు.

బుల్లెట్టు లేదా మోడరన్ కార్ లో వస్తూ సందడి చేస్తుంటారు. అయితే ఇవాళ గుర్రంపై వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

ధర్మవరం పట్టణ వీధుల్లో గుర్రపు స్వారీ చేస్తూ అందర్నీ ఆకర్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో ఫోటోలు దిగేందుకు పలువురు అభిమానులు పోటీపడ్డారు.

అన్నీ చూడండి

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

Nayanthara : విలన్ లేకుండా నయనతార, కవిన్ జంటగా హాయ్ చిత్రం

బాలయ్య బాబాయ్ త్వరగా కోలుకోవాలి : నందమూరి బ్రదర్స్

షూటింగులో గాయపడిన నందమూరి బాలకృష్ణ

Balakrishna injured : కాకినాడలో నందమూరి బాలకృష్ణ కు గాయాలు 15రోజుల విశ్రాంతి

తర్వాతి కథనం
Show comments