సంబంధిత వార్తలు
- ఇంజినీరింగ్ విద్యార్థులకు అద్భుత అవకాశం, కోటి మందికి ఉచితంగా ఇంటర్న్షిప్
- వివాహితుడితో ప్రేమ.. ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
- కలుషిత ఆహారం ఆరగించిన 26 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల అస్వస్థత
- ట్రయాంగిల్ లవ్ స్టోరీనే నవీన్ హత్యకు కారణమా? .. ఫోన్ కాల్ ఆడియో వైరల్
- గూడూరులో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. షాక్లో వార్డెన్ మృతి
విద్యార్థి జేబులోని సెల్ఫోన్ ఒక్కసారిగా పేలింది.. ఎక్కడ?
ఓ ఇంజినీరింగ్ విద్యార్థి జేబులోని సెల్ఫోన్ ఒక్కసారిగా పేలింది. నెల్లూరులో జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని లింగసముద్రం మండలం చిన్నపవనికి చెందిన సాయిప్రదీప్ నిన్న బోగోలు మండలం కడనూతలతోని ఆర్ఎస్ఆర్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు స్కూటీపై బయలుదేరాడు.
మార్గమధ్యంలో కొత్తపల్లి వద్ద జేబులోని మొబైల్ ఫోన్ ఒక్కసారి పేలింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న సిమెంట్ బల్లను ఢీకొట్టి కిందపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని కావలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
