1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Murder at Vijayawada

దుర్గా అగ్రహారంలో కత్తులతో స్వైర విహారం.. వ్యక్తి మృతి

Vijayawada
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. పట్టణంలోని దుర్గా అగ్రహారంలో శుక్రవారం ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపారు. ఆగంతకుల దాడిలో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు.
 
ఈ హత్య తర్వాత దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారణంగా హంతకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హత్యా ఘటనతో స్థానికంగా ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్‌ బ్లాక్