శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఆగస్టు 2018 (09:15 IST)

కీచక టీచర్.. కోర్కె తీర్చాలంటూ విద్యార్థినులకు టార్చర్

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. తన వద్ద చదువుకునే 4, 5 తరగతులకు చెందిన విద్యార్థినిలకు లైంగిక వేధింపులతో చుక్కలు చూపించారు. ఈ వేధింపులను భరించలేని ఆ విద్యార్థినిలు తమ గోడును

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. తన వద్ద చదువుకునే 4, 5 తరగతులకు చెందిన విద్యార్థినిలకు లైంగిక వేధింపులతో చుక్కలు చూపించారు. ఈ వేధింపులను భరించలేని ఆ విద్యార్థినిలు తమ గోడును తల్లిదండ్రుల వద్ద వెళ్లబోసుకున్నారు. దీంతో వారంతా పట్టుకుని దేహశుద్ధి చేసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
 
కడగుంట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా గౌరబత్తిన ప్రసాద్ పని చేస్తున్నాడు. కామవాంఛతో కొట్టుమిట్టాడుతున్న హెచ్.ఎం. విద్యార్థులకు పాఠాలు బోధించడంమానేసి వారిని తన వికృత చేష్టలతో లైంగికంగా వేధించసాగాడు. 
 
ఇక వీడితో వేగలేమని భావించిన విద్యార్ధినిలు విషయాన్ని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో బాలికల తల్లిదండ్రులు ఆయన్ను పట్టుకుని చితకబాది ఆ తర్వాత బాలాయపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కీచక టీచర్‌పై కేసు నమోదు చేశారు. బాలాయపల్లి ఎమ్మార్వో స్కూల్ వద్దకు చేరుకుని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు.