భర్తపై ప్రైవేట్ చానెల్ న్యూస్ రీడర్ కేసు మీద కేసు!
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తున్న అనుశ్రీ అనే యువతికి మల్లికార్జున్ అనే వ్యక్తితో ఓ యేడాది క్రితం వివాహమైంది. పెళ్ళయిన దగ్గర్నుంచీ ఆ న్యూస్ రీడర్కి చిత్రహింసలు, మనోవేదన తప్ప సంతోషం అనే మాటే లేకుండా చేశాడు. పైగా సదరు భర్తగారు మరో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడటంతో న్యూస్ రీడర్ హైదరాబాద్లోని సంజీవరెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దాంతో పోలీసులు అతనిమీద కేసు నమోదు చేశారు. దాంతో అతని రెండో పెళ్ళి ఆగిపోయిందేమో, అప్పట్నుంచి అతను తన భార్య పనిచేస్తున్న న్యూస్ ఛానల్ దగ్గరకి వచ్చి కేసును ఉపసంహరించుకోవాలని గొడవ చేయడం ప్రారంభించాడు. కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తా, పొడిచేస్తా అని బెదిరించడం మొదలుపెట్టాడు. దాంతో ఆమె మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈసారి మరోకేసు నమోదు చేశారు.