అమరావతి తరహాలోనే మచిలీపట్నం పోర్టు రైతులకు ప్యాకేజీ
నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం అమరావతి ప్యాకేజీ తరహాలోనే మచిలీపట్నం పోర్టు ప్రాంతం రైతులకు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. భూసేకరణపై రైతులు ఆందోళనకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. పోర్టు రైతులు సహకరించాలని కోరారు.
శుక్రవారం శాసనసభలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబును మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ కలిసి రైతుల ఆందోళనపై వివరించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. రైతులకు హాని కల్గించే ఏ చర్యలను తమ ప్రభుత్వం తీసుకోదన్నారు. మచిలీపట్నం పోర్టు సిటీని మెగా ఇండస్ట్రియల్ సిటీగా మార్చాలని పట్టుదలతో ఉన్నట్లు సీఎం తెలిపారు.