1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2024 (12:45 IST)

భీమవరం నుంచి పవన్ కల్యాణ్?, కుప్పం నుంచి చంద్రబాబు: 118 అభ్యర్థుల జాబితా విడుదల

pawan kalyan-Chandrababu Naidu
తెదేపా-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు-పవన్ కల్యాణ్ ఇద్దరూ విడుదల చేసారు. తొలి దఫా లిస్టులో 118 అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 94 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
 
జనసేన 24 స్థానాల నుంచి పోటీ చేస్తుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పాలని తాము ఈరోజును ఎంపిక చేసుకున్నట్లు చంద్రబాబు నాయుడు అన్నారు. తాము ఏపీ అభివృద్ధి ధ్యేయంగా, ప్రజా శ్రేయస్సు కోసం పొత్తుతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అంతకుముందు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ఏపీ అభివృద్ధి తెదేపా-జనసేన-భాజపా కూటమితో సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని తిరోగమనం దిశకు తీసుకెళుతున్న పాలనకు చరమగీతం పాడేందుకు తాము కలిసికట్టుగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
 
కాగా ఈ లిస్టులోనే కీలక నాయకులు పోటీ చేసే స్థానాలను కూడా ఖరారు చేసారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన భీమవరం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే మంగళగిరిలో పరాజయం పాలైన నారా లోకేష్ ఈసారి కూడా అక్కడి నుంచి పోటీకి దిగుతున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి బరిలోకి దిగుతున్నారు. అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి, జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపి పొత్తు, సీట్ల సర్దుబాటు చేసుకుని మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలియజేసారు.