1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 జనవరి 2024 (12:11 IST)

అయోధ్యకు రాముడు.. ఐదు శతాబ్దాల పోరాటం.. పవన్ ట్వీట్

pawan kalyan
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం అయోధ్య వెళ్లారు. రాముడు భజనలు వింటూ ఉన్న తన వీడియోని షేర్ చేశారు. ఎయిర్ పోర్టు నుంచి అయోధ్యకు వెళ్తుండగా కారులో నుంచి ట్వీట్ చేశారు. 
 
శ్రీరాముడు భారతీయ నాగరికతకు హీరో అని పవన్ కల్యాణ్ అన్నారు. ఇంకా శ్రీరాముడిని అయోధ్యలోకి తిరిగి తీసుకురావడానికి ఐదు శతాబ్దాల పోరాటం పట్టింది. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీ రామ్.. అని తన పోస్టులో పవన్ అన్నారు.