విశాఖ నుంచి రోమ్ వరకు వ్యాపారం జరిగేది.. ప్రధాని

శనివారం, 12 నవంబరు 2022 (15:05 IST)
విశాఖపట్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ప్రస్తుతం తెలంగాణకు చేరుకున్నారు. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ప్రజలను కలవడం సంతోషంగా వుందని మోదీ అన్నారు. విశాఖలో నిర్వహించిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ.. భారత్‌కు విశాఖ ఎంతో ప్రత్యేక నగరమన్నారు. 
 
విశాఖ ఓడరేవు ద్వారా వెయ్యేళ్ల క్రితం నుంచే రోమ్ వరకు వ్యాపారం జరిగేదని గుర్తు చేశారు. రూ.10,742 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులతో ప్రజలకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. 
 
ఏపీ ప్రజలు మంచి వారని, స్నేహ స్వభావం కలిగిన వారని ప్రధాని ప్రశంసలు గుప్పించారు. ప్రతి రంగంలో మెరుగైన మార్పు కోసం తెలుగు ప్రజలు తపన పడతారని కితాబిచ్చారు. తెలుగు భాష ఉన్నతమైందని పేర్కొన్నారు. 
 
ఇకపోతే, విశాఖలో చేపల రేవును ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రతి దేశం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటోందని... సంక్షోభంలో ఉన్న ప్రతి దేశం భారత్ వైపు చూస్తోందని తెలిపారు.

అన్నీ చూడండి

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments