పోలవరం ప్రాజెక్టు గడువును పెంచిన కేంద్రం

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 19 జులై 2022 (17:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువును కేంద్ర ప్రభుత్వం మరోమారు పొడగించింది. నిజానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం గత యేడాదే పూర్తికావాల్సివుంది. కానీ, ఈ గడువును వచ్చే 2024కు పొడగించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం రాతపూర్వక సమాధానమిచ్చింది. ఈ యేడాది ఏప్రిల్ నాటికే పోలవరం పూర్తి కావాల్సివుందని ఆ ప్రకటన పేర్కొంది. 
 
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై కేంద్ర జలశక్తి శాఖ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ చర్యల వల్లే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చోటుచేసుకుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వహణలోనూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి లోపభూయిష్టంగా ఉందని తెలిపారు. ఈ కారణంగానే నిర్మాణంలో తీవ్ర జాప్యానికి కారణమైందని తెలిపారు. అందుకే పోలవరం నిర్మాణ గడవును మరోమారు పొడగించక తప్పలేదని పేర్కొంది. 

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments