1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ శుభవార్త... ఏంటది?

train
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. శంషాబాద్ - విజయవాడ - విశాఖపట్టణం, కర్నూలు -విజయవాడ మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ దిశగా కేంద్ర రైల్వేశాఖ కసరత్తులు చేపట్టింది. ఇందులోభాగంగా, ఈ రెండు మార్గాల్లో ప్రాథమిక ఇంజనీరింగ్ మరియు ట్రాక్ (పెట్) సర్వేకు ఆదేశించింది. సర్వే అనంతరం రైల్వే ప్రాజెక్టులపై తుది నిర్ణయం తీసుకుంటారు. 
 
శంషాబాద్ - విజయవాడ ప్రాంతాల మధ్య రైలు అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని, కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వివరించారు. దీంతో కేంద్ర రైల్వే శాఖ ఈ మార్గంలో పెట్ సర్వేకు అనుమతులు మంజూరు చేసింది. 
 
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు గంటకు 110 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్నాయి. అయితే, ఇపుడు ప్రతిపాదించిన రెండు సూపర్ ఫాస్ట్ రైలు మార్గాలు మాత్రం అందుబాటులోకి వస్తే ఈ మార్గాల్లో ఏకంగా 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ భావిస్తుంది. 
 
ఈ క్రమంలోనేనే రూట్‌ను నిర్ణయించేందుకు పెట్ సర్వే కోసం ఓ కాంట్రాక్టర్‌ను కూడా ఎంపిక చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వందే భారత్ రైళ్లను నడిపే విషయాన్ని కూడా భారతీయ రైల్వే సిద్ధమవుతుంది.