తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలం ఎస్ అన్నవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కాతా సత్యనారాయణను దారుణంగా హత్య చేశారు. రిపోర్టర్ ను కత్తితో నరికి దుండగులు పరారైయ్యారు. తొండంగి అర్బన్ రిపోర్టర్గా సత్యనారాయణ పనిచేస్తున్నారు. దీంతో మృతుడి కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ హత్యను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం. ఈ కేసును సీరియస్ గా తీసుకుని...