1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Rs 500 crore for Kurnool Hospital

కర్నూలు పెద్దాసుపత్రికి రూ.500 కోట్లు

Kurnool Hospital
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల భవనాలు, వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. నాడు-నేడు కింద ఈ నిధులను ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ జీవో జారీ చేశారు.

ఏప్రిల్‌లో పనులు ప్రారంభం కానున్నాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యసేవలు ఒకే చోట ఉండేలా భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొత్తం రూ.500 కోట్లలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రూ.300 కోట్లు, కర్నూలు మెడికల్‌ కాలేజీకి రూ.200 కోట్లు కేటాయించింది.
 
నాడు-నేడు కింద నంద్యాల, ఆదోని మెడికల్‌ కాలేజీలకు రూ.950 కోట్లు కేటాయిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జీవోను విడుదల చేశారు. నంద్యాలకు రూ.475 కోట్లు, ఆదోనికి రూ.475 కోట్లకు అనుమతులు జారీ చేశారు. 
About Writer
ఎం
తర్వాతి కథనం
మద్రాసు వర్శిటీలో లైంగిక వేధింపుల కలకలం.. హెచ్‌వోడీ అలా తాకాడు..