లిమ్కా బుక్ రికార్డుల్లోకెక్కిన సత్తెనపల్లి మరుగుదొడ్లు..!
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ప్రభుత్వం నిర్మించిన మరుగుదొడ్లు రికార్డుకెక్కాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సత్తెనపల్లిలో 20 వేల మరుగుదొడ్లు నిర్మించడం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం లభించింది. ఈ విషయంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మాట్లాడుతూ.. సత్తెనపల్లిలో 20 వేల మరుగుదొడ్లు పూర్తిచేసి లిమ్కా బుక్లో చోటు సంపాదించడం సంతోషకరమన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంట్లో మరుగుదొడ్లను నిర్మించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని చెప్పారు. ఇలాంటి బృహుత్కర కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, వరల్డ్బ్యాంక్ పాలుపంచుకోవడం శుభపరిణామమని అన్నారు.