కృష్ణాజిల్లాలో దారుణం: చాక్లెట్ కోసం వంగి.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు..

బుధవారం, 15 డిశెంబరు 2021 (10:28 IST)
కృష్ణాజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బస్సు చక్రాల కింద పడి చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాలకు పంపడానికి నాన్నతోపాటు వెళ్లిన బాబు జీవితాన్ని బస్సు చిదిమేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. కోడూరుకు చెందిన శ్రీనివాసరావు, ప్రభావతి దంపతులకు ఆదిత్య, దినేష్‌కుమార్‌(3) కుమారులు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదిత్య ఎల్‌కేజీ చదువుతున్నాడు. 
 
మంగళవారం శ్రీనివాసరావు... ఆదిత్యను బస్సెక్కించేందుకు తీసుకురాగా వారి వెనుకనే దినేష్‌కుమార్‌ నడుచుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో చేతిలోని చాక్లెట్‌ కిండపడటంతో దాన్ని తీసుకోవడానికి బస్సు వెనుక చక్రాల కిందకు దినేష్‌ వంగాడు. చిన్నారిని ఎవరూ గమనించలేదు. 
 
డ్రైవర్‌ బస్సును ముందుకు నడపడంతో చక్రాల కింద తల నలిగి దినేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని చూసిన శ్రీనివాసరావు స్పృహతప్పి పడిపోయారు. 
 
క్షణకాలంలో చిన్నారి మృత్యువాత పడటం స్థానికులను కలచివేసింది. స్థానికంగా విషాదం నెలకొంది. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సును నడపడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అన్నీ చూడండి

Fauji Update: ఫౌజీ తిరుగుబాటు ప్రారంభమయింది, రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్

Mangli :హుషార్‌ పిట్టలు నుంచి మంగ్లీ ఆలపించిన హుషార్‌ గీతం టోంగా.. టోంగా

KA13 : హీరో, రచయిత, దర్శకుడిగా మూడు కీలక బాధ్యతల తో KA13 బిహైండ్-ది-సీన్స్

Akhil :అయ్యగారే నం.1 అన్న ఫ్యాన్‌ వల్లే పేరొచ్చింది - లెనిన్ ఐదు రోజుల కలెక్షన్స్

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

తర్వాతి కథనం
Show comments