Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. మంగళవారం ఇరువైపుల వాదనలు ముగిశాయి.
బెయిల్ మంజూరు చేస్తే వల్లభనేని వంశీ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించింది. వంశీ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరపు న్యాయవాది కోర్టును కోరారు.
తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత, న్యాయమూర్తి కొద్దిసేపటి క్రితం వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ను తిరస్కరించి తీర్పు ఇచ్చారు. ఇదే కేసులో మరో నలుగురు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది.