శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 14 ఆగస్టు 2024 (17:48 IST)

పితృ పక్షాల సందర్భంగా ప్రత్యేక యాత్ర రైలు

train
భారతీయ రైల్వేలు - భారత్ గౌరవ్ పథకం కింద సేవలను అందించే అత్యంత విజయవంతమైన ప్రైవేట్ రైలు సౌత్ స్టార్ రైలు, పితృ పక్షాల సందర్భంగా, తమ తదుపరి పర్యటనను ప్రకటించింది. ప్రయాగ్ రాజ్- కాశీ- గయా- అయోధ్య- మథుర- ఉజ్జయిని- ఓంకారేశ్వర్- సోమనాథ్- ద్వారకా- మాతృగయకి 14.09.2024-28.09.2024 (15 రోజులు). ఈ యాత్ర పవిత్ర నగరాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత యొక్క లీనమయ్యే అనుభవాన్ని అందిస్తుంది.
 
ఈ పర్యటనలో పితృ పక్షాల సందర్భంగా గయా, మాతృగయలో పిండ తర్పణం చేయటం, వారణాసి యొక్క ఆధ్యాత్మిక ఆకర్షణను అన్వేషించడం, అయోధ్యలోని రామమందిరంను సందర్శించడం, మథుర, ద్వారకా, సోమనాథుని దర్శనం, ఉజ్జయిని లోని ఓంకారేశ్వర్, మహాకాళేశ్వరులని దర్శించుకోవటం మరియు ప్రయాగ్‌రాజ్ యొక్క పవిత్ర సంగమ స్నానం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభవించడం వంటివి ఉన్నాయి.
 
ఈ ప్రత్యేక రైలు చెన్నై నుండి బయలుదేరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, కాజిపేట్ స్టేషన్లలో పర్యాటకులకు రైలు ప్రయాణం చేసేందుకు వీలు కల్పిస్తున్నారు.
 
ఈ రైలు ప్రత్యేకతలు: దారి పొడువునా యాత్ర విశేషాలను వివరించేందుకు PA సిస్టమ్స్, కోచ్ సెక్యూరిటీ & టూర్ మేనేజర్‌లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, వసతి, సందర్శనా & బస్సు, మూడు పూటల ఉల్లి వెల్లులి లేకుండా బ్రాహ్మణ భోజనం సహా వివిధ రకాల సౌకర్యాలను కలిగి ఉంది. యాత్రికులు LTC/LFC సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.
 
3 AC (Comfort) Rs.53,500 /-
విచారణలు, బుకింగ్‌ల కోసం 833 200 8686 సంప్రదించండి, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి traintour.inని సందర్శించండి.