1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 3 మార్చి 2015 (15:56 IST)

ఏపీని కేంద్రం ఆదుకునేలా లేదు.. దేవుడే రక్షించాలి : టీఎస్సార్

విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకునే సూచనలు మచ్చుకైనా కనిపించడం లేదని ఇక ఆ దేవుడే రక్షించాల్సి ఉంటుందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి వ్యాఖ్యానించారు. సాధారణ బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం చేసినందుకు ఆయన మంగళవారం రాజ్యసభలో తన నిరసనన వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన సమయంలో ఇచ్చిన హామీల మేరకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని దేవుడైనా రక్షించాలి, లేదా కేంద్రమైనా ఆదుకోవాలి అని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తారంటూ ఏపీ ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.