శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 11 డిశెంబరు 2021 (15:10 IST)

దేవాలయాల్లో హుండీ దొంగతనాలకు పాల్పడే ముఠా అరెస్ట్

దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ‌ల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.  గుంటూరు ఎస్పీ అరి ఫ్ హాఫిజ్ మీడియాతో మాట్లాడుతూ, గుడిలో హుండీలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడే 9 మందిని అరెస్ట్ చేశారు. 
 
 
నిందితుల నుంచి ఒక ఆటో, రెండు బైక్ లు, కట్టర్లు, 4,600 న‌గ‌దు స్వాధీనం చేసుకున్నామ‌ని గుంటూరు ఎస్పీ అరిఫ్ హాఫిజ్ చెప్పారు. నిందితులు అంతా గుంటూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించామ‌ని ఎస్పీ తెలిపారు. 

 
దేవాలయాలల్లో దొంగతనాలకు పాల్పడే మ‌రో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నార‌ని, వారికోసం గాలిస్తున్నామ‌ని చెప్పారు. గుంటూరు అర్బన్ పరిధిలో సమస్యాత్మక‌ ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నామ‌ని, జిల్లా ఎస్పీ కార్యలయంలో బాధితులు ఫిర్యాదులు చేయ‌డానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని ఎస్పీ అరిఫ్ హాఫిజ్ చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంద‌ని వివరించారు.