1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Tirumala: Bear scares devotees on Srivari mettu footpath

అలిపిరి నడకదారిలో ఎలుగుబంటి..

bears
తిరుపతి అలిపిరి నడకదారిలో వన్యమృగాల సంచారం పెరిగిపోతోంది. ఇప్పటికే చిరుత భయం శ్రీవారిని భక్తులను భయపెడుతోంది. ఇది చాలదన్నట్లు అలిపిరిలో బుధవారం రాత్రి 11.45 గంటల నుండి 12.30 గంటల మధ్య ఎలుగుబంటి తిరుగుతూ కనిపించింది. దీన్ని చూసి భక్తులు భయాందోళనలకు గురయ్యారు. 
 
చాలాసేపటికి ఎలుగుబంటి ఆ ప్రాంతంలో నడకదారిలో తిరుగుతూ కవిపించింది. దీనిపై భక్తులు తిరుపతి దేవస్థాన భద్రతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అటవీ శాఖాధికారులకు సమచారం అందించారు. ప్రస్తుతం ఎలుగుబంటికి బోనును అమర్చారు. తిరుపతి అలిపిరి నడకదారిలో చిరుతలు, ఎలుగుబంటి తిరగడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
చవితి వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన యువకుడు