1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 జూన్ 2025 (16:55 IST)

Jagan Rally: గుంటూరులో జగన్ ర్యాలీ.. కాన్వాయ్ కారు ఢీకొని వృద్ధుడు మృతి (video)

Jagan
Jagan
ఏపీ మాజీ సీఎం, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో వున్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు.  గుంటూరు జిల్లా లాల్‌పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. 
 
జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో జగన్ కాన్వాయ్‌ వెంట ఉన్న ఒక కారు లాల్‌పురం హైవే దగ్గర ఓ వృద్ధుడిని ఢీకొంది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం వృద్ధుడిని రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయారు. చివరికి స్థానికులు స్పందించి ఆ వృద్ధుడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మృతి చెందాడు. దీంతో వైసీపీ కార్యకర్తలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.