సంబంధిత వార్తలు
- జంట నగరాలుగా సిరిసిల్ల, వేములవాడ
- పరుగు పందెంలోనే కాదు.. పిల్లలు పుట్టించడంలోనూ దూకుడే. బోల్ట్కు కవలలు
- ఇద్దరూ ఒకేసారి పుట్టారు, హైదరాబాదులో సాఫ్ట్వేర్ జాబ్స్, కరోనా కాటుతో ఇద్దరూ...
- గర్భంతో వున్నప్పుడు శృంగారం.. రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రెగ్నెంట్.. కవలలు పుట్టారు?!
- ట్వింకిల్ ఖన్నాను ట్రోల్ చేసిన నెటిజన్లు.. ఘాటుగా బదులిచ్చిన అక్షయ్ భార్య
తాడేపల్లిలో తాళం వేసిన ఇంట్లో... జంట మృతదేహాలు!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న తాడేపల్లి ప్రాంతంలో ఒక జంట మృతదేహాలు బయటపడ్డాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి లో ఓ నివాసం లో గుర్తు తెలియని రెండు మృతదహాలు కనిపించాయి. ఈ జంట మృతి చెంది వారం రోజులు అయివుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చుట్టుపక్కల వారికి దుర్వాసన రావటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి తాళాలు వేసి ఉండటంతో తాళాలు పగలకొట్టి ఆ ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించగా, ఈ జంట మృతదేహాలు కనిపించాయి.
వీరిద్దరూ భార్య భర్తలు అయి ఉండవొచ్చని, ఇంటికి తాళాలు వేసుకొని ఆత్మహత్యకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం పోలీసుల దర్యాప్తు చేపట్టారు.
