1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (09:05 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం అప్పు రూ.3.98 లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అప్పుల వివరాలను కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది.  
 
ఏపీ అప్పుల భారం ప్రతి యేటా పెరుగుతుందని కేంద్రం తెలిపింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లు ఉండగా, ఇపుడు ఇది రూ.3.98 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 
 
గత 2017-18లో 9.8 శాతం అప్పులు తగ్గాయని, 2020-21 నాటికి రూ.17.1శాతంగా ఉందని వివరించింది. ఏపీ జీడీపీలోనూ మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగిందని వెల్లడించింది. గత 2014లో రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 42.3 శతాంగా ఆ తర్వాత ఇది తగ్గిందని తెలిపారు. 
 
అదేవిధంగా 2015లో రాష్ట్ర జీడీపీలో 23.3 శాతం అప్పులు ఉన్నాయని, అదే 2021కి వచ్చేసరికి రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 36.5 శాతానికి పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ తన సమాధానంలో వెల్లడించింది. ఈ వివరాలన్నింటినీ కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా వెల్లడించారు.