1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2023 (13:26 IST)

స్కూలు బాలికపై తండ్రి స్నేహితుల అఘాయిత్యం

assult
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. స్కూలుకు వెళుతున్న ఓ బాలికపై ఆ బాలిక తండ్రి స్నేహితులే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, ఎప్పటిలాగే సోమవారం స్కూలుకు బయలుదేరింది. అయితే, బాలికను ఆమె తండ్రి స్నేహితులు ముగ్గురు అడ్డుకుని కిడ్నాప్ చేశారు. బలవంతంగా ఆమెను బైక్ ఎక్కించుకుని ఓ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక కామాంధులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా, చంపేస్తామని బెదిరించారు. 
 
పైగా, సామూహిక అత్యాచారానికి వీడియో తీశారు. ఈ విషయాన్ని బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని హెచ్చరించారు. అయితే, ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తండ్రికి చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.