1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

యూపీలో దారుణం... యువతిని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుల్స్...

woman draged
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సాటి మహిళ పట్ల ఏమాత్రం కనికరం లేకుండా ప్రవర్తించారు. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన యూపీలోని హర్దోయి జిల్లాలో శనివారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ కేశవ్ చంద్ గోస్వామి సస్పెండ్ చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు ఇలా చేశారని బాధితురాలు బోరున విలపిస్తూ చెప్పింది. 
 
పిహానీ ప్రాంతానికి బాధితురాలు ఎస్పీ కార్యాలయం గోడ ఎక్కేందుకు ప్రయత్నించిందని పోలీసులు చెబుతున్నారు. కానీ, తాను ఓ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు మాత్రమే వచ్చానని బాధితురాలు చెబుతుంది. తనను లోపలికి అనుమతించకుండా ఇలా దారుణంగా ఈడ్చుకెళ్లారని వాపోయింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించామని, ఎస్పీ మీడియాకు తెలిపారు.