శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (13:35 IST)

వినాయకుడి నిమజ్జనంలో అపశృతి..

ఏ-కొండూరులో తండాలో విషాదం అలుముకుంది. వినాయకుడ్ని నిమజ్జనం చేసేందుకు తండాలోని చెరువులో దిగిన ముగ్గురు యువకులు మృతి. చనిపోయిన వారి పేర్లు బాణవతు గోపాలరావు, భూక్యా శంకర్, భూక్యా చంటి. వినాయకుడ్ని చెరువులో నిమజ్జన చేసే ప్రదేశం లోతేక్కువగా ఉండటంతో నీటిలో మునిగి ఊపిరి ఆడక ముగ్గురు యువకులు ప్రాణాలు వదిలారు.

సంఘటన స్థలానికి చేరుకున్న ఏ-కొండూరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. అర్థరాత్రి కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడినప్పటికీ మైలవరం సీఐ శ్రీను తన ధైర్య సాహసాలను ప్రదర్శించి చెరువులోకి దిగి చనిపోయిన ముగ్గురు యువకుల మృతదేహాలను అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చిన వైనం.. పరిస్థితిని సమీక్షిస్తున్న నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు.