1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Vizag: Two dies in Road Accident

విశాఖపట్టమంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

Vizag
విశాఖపట్టణం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం సంభవించింది. 
 
విశాఖ నగరంలోని ఎలమంచిలి పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని అటుగా వెళుతున్న లారీ ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ రోడ్డు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామాకు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆదిలాబాద్‌లో వింత - పాలు తాగుతున్న నందీశ్వరుడు