1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Worker Dies in Blast at Salkapuram

కొండ తవ్వకం.. బ్లాస్టింగ్ ఆపరేషన్.. కూలీ దుర్మరణం

జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో రోడ్డు నిర్మాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ సింగ్ (34) అనే కూలీ ప్రాణాలు కోల్పోయాడు.
 
కొండ తవ్వకం కోసం బ్లాస్టింగ్ ఆపరేషన్‌లో రాళ్లు పడిపోవడంతో విజయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఏవీపీ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే నిర్మాణ సంస్థకు బ్లాస్టింగ్‌కు అనుమతులు లేవని, అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలు సాగిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
డిసెంబరులో అమరావతి నిర్మాణం ప్రారంభం.. డిమాండ్ పెరుగుతుందోచ్!