1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 31 డిశెంబరు 2021 (11:11 IST)

గ‌ల్లా జ‌య‌దేవ్ ని క‌లిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియ‌న్ కిడాంబి శ్రీకాంత్

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి, తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించిన కిడాంబి శ్రీకాంత్‌ ని గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ అభినందించారు. గుంటూరులో ఎంపీ నివాసంలో శ్రీకాంత్ జ‌య‌దేవ్ తో పాటు గుంటూరు తూర్పు టిడిపి ఇంచార్జి మొహమ్మద్ నసీర్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు, టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు గార్లను మర్యాదపూర్వకంగా కలిశారు. 
 
 
శ్రీకాంత్ ప్ర‌తిభ‌ను ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కొనియాడారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిష్ఠ‌ను ఇనుమ‌డింప జేసిన యువ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్  అని, ఆయ‌న స్ఫూర్తితో మ‌రింత మంది క్రీడాకారులు రాణించాల‌న్నారు. గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ, మాజీ తెలుగుయువత అధ్యక్షులు సౌపాటి రత్నం, తెలుగు యువత పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండెపు శేఖర్ బాబు, అధికార ప్రతినిధులు ముహమ్మద్ సీఫ్,షేక్ షుకూర్,ప్రచార కార్యదర్శి చెరుకుపల్లి నాగరాజు,కార్యదర్శి మాచవరపు దాసు,ఐటీడీపి రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి శేషు,టిడిపి నాయకులు కనకారావు, కిరణ ,గుత్తికొండ కిరణ్, చేబ్రోలు కిరణ్, కుర్రా పవన్ తథితరులు పాల్గున్నారు.