సంబంధిత వార్తలు
- నేడు ప్రధానితో భేటీకానున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
- ట్రాక్టర్ను ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు భక్తుల దుర్మరణం
- బిల్కిస్ బానో కేసు : దోషులందరికీ స్వేచ్ఛ - రాహుల్ ఫైర్
- నెత్తిమీద రుమాలు కట్టి వేషం వేసి డైలాగులు చెప్తే సరిపోతుందా : సీఎం కేసీఆర్
- పదవే కావాలని ఆశపడివుంటే ఎపుడే ఎంపీ అయివుండేవాడిని: పవన్ కళ్యాణ్
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సీఎం జగన్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం ప్రధానిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. వీటితో పాటు విభజన హామీలు అమలు చేయాలని మరోమారు ప్రధానిని సీఎం కోరినట్టు సమాచారం.
మరోవైపు సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే.సింగ్తో సీఎం సమావేశం కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో సమావేశమవుతారు. అలాగే, మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ వెంట వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు.
తర్వాతి కథనం
