గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2019 (16:31 IST)

అరాచకాలకు గొడుగు పట్టింది చంద్రబాబే : వైకాపా నేత సీఆర్

రాష్ట్రంలో అరాచకాలకు గొడుగు పట్టింది చంద్రబాబే అని వైకాపా నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే, కోడెల శివప్రసాద్ కుమార్తె, కుమారులపై బాధితులు ఎన్ని కేసులు పెట్టారు. చంద్రబాబు ప్రజాస్వామ్యానికి నీ భాషలో నిర్వచనం వేరా. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వై ఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లడం దారుణం.
 
చంద్రబాబు హయాంలో చట్టాన్ని తన పని తాను చేయ నిచ్చారా. తన పార్టీ క్యాడర్ కూడా చంద్రబాబును విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. ప్రజాస్వామ్యం, పోలీస్ వ్యవస్థ గురించి చంద్రబాబు మాట్లాడటం ఏంటి సిగ్గు పడాలి. చంద్రబాబు నీ పని అయిపోయింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంద రోజుల పాలనలో చంద్రబాబు వంద అబద్ధాలు మాట్లాడారు. 
 
8 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు అంటున్నారు. టీడీపీ నేతలు మీద దాడులు చేసారంటున్నారు. టీడీపీ నేతలు మీద దాడులు, హత్యలు చేస్తే ఎందుకు ఏ మీడియాలో కూడా ఎందుకు రాలేదు. పోలీస్ రికార్డుల్లో ఎందుకు ఎక్కలేదు. కొంత మందికి డబ్బులు ఇచ్చి చంద్రబాబు పునరావాస కేంద్రాలకు తీసుకొస్తున్నారు. 

గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు జరిగితే దాన్ని రాజకీయ ప్రయోజనాలు కోసం చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లిస్తున్నారు. చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు ఎవరు రాకపోవడంతో డబ్బులు ఇచ్చి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారు.
 
వనజాక్షి, ఐపీఎస్ అధికారి మీద మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు దాడి చేస్తే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తిరుపతి వస్తే టీడీపీ నేతలు రాళ్ళ దాడి చేశారు. సీఎం వై యస్ జగన్మోహన్ రెడ్డి వంద రోజుల ప్రజా సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు.

తెలంగాణలో టీడీపీ మొత్తం ఖాళీ అయ్యింది. ఏపీలో కూడా టీడీపీ ఖాళీ కాబోతోంది. రాష్ట్రంలో మరో 30 ఏళ్ళు వైస్సార్సీపీ అధికారంలో ఉంటుంది భావించిన చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. అందుకే అయ్యన్న పాత్రుడుతో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పిస్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీ  పొత్తుపై అయ్యన్నపాత్రుడు మాటలు చంద్రబాబు మాట్లాడించిన మాటలే. 
 
కోడెల అరాచకాలపై సిట్ ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే ఎందుకు చంద్రబాబు మాట్లాడలేక పోతున్నారు. టీడీపీ నేతలు అంబోతుల్లా తయారై రాష్ట్రాన్ని దోచుకున్నారు. రాష్ట్రంలో చంద్రబాబుకు నచ్చిన 10 గ్రామాలను ఎంచుకుని చర్చకు వెళ్దాం. జన్మభూమి కమిటీలు వలన ప్రజలకు అన్యాయం జరిగిందా లేదా జగన్ ప్రభుత్వం వలన ప్రజలకు మేలు జరిగిందా అనేదానిపై చర్చ పెడదాం.. చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగా లేని పోనీ అరాచకాలు సృష్టిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.