1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 డిశెంబరు 2019 (09:45 IST)

వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 225 సీట్లు ఇవ్వాలి : విజయసాయి రెడ్డి

విశాఖపట్టణంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి నోరు జారారు. వీటిపై విపక్షాలతో పాటు.. నెటిజన్లు తమదైనశైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ముఖ్యంగా, తెలుగుదేశం, జనసేన పార్టీలు విజయసాయి రెడ్డిపై చేస్తున్న ట్వీట్లను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 
 
ఈ పుట్టినరోజు వేడుకల్లో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, 'ఈసారి 151 సీట్లు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని 225 స్థానాలకుగానూ 224 స్థానాల్లో గెలిపించాలి' అని కోరారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఏపీలో ఉన్నది 175 స్థానాలే కదా.... 225 ఎక్కడివి అంటూ ట్రోల్ చేస్తున్నారు. నవ్యాంధ్రలోని 175 సీట్లు మాత్రమేకాదు 25 లోక్‍సభ సీట్లను కలపుకున్నా 225 సీట్లు రావుకదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయికి దొంగ లెక్కలు వేయడంలో మంచి దిట్టగా పేరున్న విషయం తెల్సిందే.