సంబంధిత వార్తలు
- ఎస్పీకి కాదు.. వాడి అమ్మ మొగుడికి చెప్పుకో.. ఏం పీకుతారు... : వైకాపా ఎమ్మెల్యే హల్చల్..
- ఆరు నెలలో అద్భుతం - కడప చిన్నారి నోబెల్ వరల్డ్ రికార్డు...
- ఏపీలో వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సర్కారు... స్పందన పేరు మార్పు!!
- చంద్రబాబు మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యత : స్వాగతించిన యనమల
- ఆరుద్రకు చంద్రబాబు అండ.. రూ.5లక్షల సాయం.. నెలకు పదివేలు
2029 నాటికి వైఎస్సార్సీపీ పూర్తిగా కనుమరుగవుతుంది.. వరదరాజులు జోస్యం
2029 నాటికి వైఎస్సార్సీపీ పూర్తిగా కనుమరుగవుతుందని.. కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి జోస్యం చెప్పారు.
శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల మేరకు మేనిఫెస్టోలోని ఐదు కీలక అంశాల ఫైళ్లపై సంతకాలు చేసి ఇప్పటికే అమలు చేశారన్నారు.
తొలి కేబినెట్ సమావేశంలోనే సూపర్ సిక్స్ పథకాలపై కూడా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే ముఖ్యమంత్రి ధ్యేయమని రెడ్డి అన్నారు.
ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. పెండింగ్ బిల్లుల పరిష్కారానికి అన్ని శాఖలతో సమన్వయం చేస్తానని హామీ ఇచ్చారు.
