Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు పండును తింటున్నారా? ఐతే గింజల్ని పారేయకండి..

Updated: సోమవారం, 24 జూన్ 2019 (12:11 IST)
నేరేడు పండ్లను తింటున్నారా? ఐతే గింజల్ని పారేయకండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. నేరేడు పండు గింజలు మధుమేహాన్ని నియంత్రించే శక్తిని కలిగివుంటాయని.. ఆ గింజల్ని ఎండబెట్టి పొడి చేసుకుని ఉపయోగించుకుంటే మధుమేహం ఆమడ దూరంలో నిలిచిపోతుందని వారు సూచిస్తున్నారు. 


నేరేడు ఆకులు లేదా గింజల్ని ఎండబెట్టి.. పొడి చేసి రోజూ ఓ టీ స్పూన్ మేర తేనెతో కలిపి తీసుకుంటే మధుమేహంతో ఇబ్బందిపడే వారికే కాదు.. అందరికీ మేలు జరుగుతుంది. 
 
పొడిని నీళ్లలో వేసి మరిగించి కషాయం రూపంలో సేవిస్తే మధుమేహులకి మరీ మంచిది. ముఖ్యంగా గింజల్లోని గ్లైకోసైడ్‌ పిండిపదార్థాల్ని చక్కెరలుగా మారకుండా అడ్డుకుంటుంది. పైగా క్లోమగ్రంథుల నుంచి ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచే గుణాలూ ఈ గింజల్లో ఉన్నాయి. ఈ పొడి అతి దాహాన్నీ తగ్గిస్తుంది.


కాబట్టి నేరేడు పండ్లు తిని గింజల్ని పారేయకండి. ఎండబెట్టి పొడి చేసి వాడుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు 
 
ఇక నేరేడు పండు మంచి మౌత్‌ ఫ్రెష్‌నర్‌‌గా పనిచేస్తుంది. చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. ఇందులో వుండే ఆమ్లాలు జీర్ణక్రియకు తోడ్పడటం ద్వారా కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.

అన్నీ చూడండి

విద్యార్థులపై లాఠీ ప్రయోగం : సభలో అమిత్ షా మాట్లాడుతారు : కేంద్రం

హయత్‌నగర్‌: పార్కింగ్ చేసిన కారులో మంటలు.. ఎలా జరిగింది?

పంటపొలంలో రూ.5లక్షలను పాలిథిన్ సంచిలో వుంచి పాతిపెట్టిన రైతు... చివరికి? (Video)

శ్రీ చైతన్య హైస్కూల్ హాస్టల్‌లో ర్యాంగింగ్.. కర్రలు, ప్లేట్లు, బూట్లతో విద్యార్థిపై దాడి

Chennai: పోర్షే కారును ఢీకొన్న క్యాబ్- ఏఆర్ రెహ్మాన్ కుమారుడికి స్వల్ప గాయాలు

అన్నీ చూడండి

Tabu: ఇన్ కమ్ డాక్స్ డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డేగా టబు

Allu Arjun : విశాఖపట్నంలో సరికొత్త ఐకానిక్ AAA Cinemasbను ప్రారంభించిన అల్లు అర్జున్

Kiran Abbavaram : బాలీవుడ్ నిర్మాతలతో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం ఇంద్రపుత్ర

Ajay Bhupathi: ఆ సినిమాతో కిందపడ్డా మళ్ళీ నచ్చే సినిమాతో పైకి లేస్తా : అజయ్ భూపతి

Hansika: అతీంద్రియ పోలీస్ మిస్టరీ గా కపాలి నుంచి హన్సిక మోత్వాని లుక్

తర్వాతి కథనం
Show comments