వేసవికాలం: మందార పువ్వు పేస్టుతో బంగారంలా మెరిసే చర్మం..

గురువారం, 6 ఏప్రియల్ 2023 (19:50 IST)
ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది ఎదుర్కొనే సమస్య చర్మ సమస్య. ఎండాకాలంలోనే కాదు చలికాలంలోనూ చర్మం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఎలాంటి సింథటిక్ కెమికల్స్ లేకుండా సహజసిద్ధంగా మన చర్మాన్ని కాపాడుకోవచ్చు. మందార పువ్వు మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ మందార మన చర్మాన్ని రక్షించడంలో ఎంతగానో సహకరిస్తుంది. 
 
మందార పువ్వును ఎండలో బాగా ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో తేనె, కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి. మందార పొడిని తయారు చేయలేని వారు పువ్వును రాత్రంతా నీటిలో బాగా నానబెట్టి, ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసే ముందు ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ముఖాన్ని ఆవిరి పట్టాలి. దీంతో చర్మంలోని మురికి తొలగిపోతుంది. 
 
ఆ తర్వాత ముఖాన్ని బాగా తుడుచుకుని కలిపిన పేస్టును అప్లై చేయాలి. సుమారు 20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని బాగా కడగాలి. ఆ తర్వాత ఒకరోజు పాటు ముఖానికి ఎలాంటి సబ్బు వాడకూడదు. అప్పుడే అది అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఇలా వారానికోసారి చేస్తే మన ముఖం బంగారంలా మెరిసిపోతుంది.

అన్నీ చూడండి

బీహార్‌లో దారుణం... వివాహిత ఇంటికెళ్లిన యువకుడిని కొట్టి చంపేసిన కుటుంబ సభ్యులు

టీ పేరుతో మద్యం తాగించి అత్యాచారం... స్నేహితుడే నమ్మించి కాటేశాడు...

సీఎం విజయ్‌ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు : ఎంకే స్టాలిన్‌

వేములవాడలో శ్వేత నాగు ప్రత్యక్షం.. అలాగే ఇంట్లోకి నాగుపాము (video)

న్యాయం కోసం వెళ్తే.. గర్భవతిని చేసిన సీఐ.. పెళ్లి పేరెత్తేసరికి గర్భస్రావం.. ఎక్కడ?

అన్నీ చూడండి

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

నారా లోకేష్‌కు ఎక్కువ మంది పిల్లలు వుండాలని భావిద్దాం, బావ ఫోటో పెట్టావు: పూనమ్ కౌర్ ట్వీట్

Yash: టాక్సిక్ సెట్ నుండి రాయా గా అద్భుతమైన స్టిల్‌ తో యష్

Purusha : ఆద్యంతం వినోదభరితంగా పురుష:ట్రైలర్

తర్వాతి కథనం
Show comments