మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (12:51 IST)

బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్... ఒక ఏడాది ఉచితంగా..

మార్కెట్‌లో వివిధ టెలికాం సంస్థల పోటీని తట్టుకుంటూ ఎలాగైనా తమ వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి ఆరాటపడుతోంది ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్. ఇప్పటికే పలు రకాల ఆఫర్‌లతో రిలయన్స్ జియోకు సైతం గట్టి పోటీ ఇస్తున భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తాజాగా కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. 
 
భారత్ ఫైబర్ తమ వినియోగదారులకు ఏడాది పాటు రూ. 999 విలువైన అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్న‌ట్లు ప్రకటించింది. కానీ ఈ ఆఫర్ భార‌త్ ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌లో రూ.777 (18జీబీ) మరియు అంతకన్నా ఎక్కువ విలువైన ప్లాన్‌లను వినియోగిస్తున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అర్హత ఉన్న వినియోగ‌దారులు బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌కి వెళ్లి ఈ ఆఫర్‌ను పొందవచ్చు. 
 
ఇప్పటికే భారతదేశంలో అమెజాన్‌ ప్రైమ్‌ సేవలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి, అలాగే దీని వీక్షకులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆఫర్ పట్ల చాలామంది భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. వినియోగదారుల ప్రాధాన్యతలను అర్థం చేసుకుని, వారి అభిరుచికి అనుగుణంగా ఈ ఆఫర్‌ను ప్రకటించామని బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్, సీఈవో వివేక్ బంజల్ చెప్పారు.